Watchman Ranganna Dead Body Postmortem: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రంగన్న మృతిపై అనుమానాలు రావడంతో సమగ్ర విచారణ కోసం ఇవాళ రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇటు రంగన్న మరణం అంవంపై విచారణ కోసం సిట్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.