విశాఖపట్నంలో లక్షా 89 వేల కిలోల ఆవు మాంసం సీజ్ చేసిన పోలీసులు. ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్లో మంగళవారం భారీ మొత్తంలో గో మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా గో మాంసాన్ని ఎగుమతి చేస్తుండగా.. ఓ వెటర్నరీ డాక్టర్ పూర్తి వివరాలతో విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎగుమతికి సిద్ధంగా ఉన్న 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.