వైజాగ్‌లో మారథాన్.. గెలిస్తే రూ. 12 లక్షల బహుమతి

4 weeks ago 12
వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 29వ తేదీన 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు రూ. 12 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మారథాన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని.. మురికవాడల్లో వారు కూడా పాల్గొంటేనే, మట్టిలో మాణిక్యాలు బయటకు తీయొచ్చని వారు చెబుతున్నారు.
Read Entire Article