హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది . వైసీపీ నేత కుమారుడు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. క్రిెెకెట్ ఆడటానికి స్నేహితులతో కలిసి వెళ్లిన అశ్విన్ ఆరాధ్య అనే 11 ఏళ్ల బాలుడు.. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు అశ్విన్ ఆరాధ్య తండ్రి, వైసీపీ నేత వాల్మీకి లోకేష్ ప్రస్తుతం ఓ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనయుడి మరణవార్త వినగానే ఆయన అస్వస్థతకు గురికాగా.. పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.