Maddali Giri Power Bills Notice: మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి విద్యుత్ బిల్లుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన స్పిన్నింగ్ మిల్లుల విద్యుత్ బకాయిలు రూ.43.5 కోట్లు పేరుకుపోవడంతో అధికారులు ఇంటి కనెక్షన్ తొలగించాలని నోటీసు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూళ్లు సక్రమంగా జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గిరి కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.