Punganur Constituency In Annamayya District: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాయచోటి కలెక్టర్ కార్యాలయానికి అభ్యంతరాలు రానప్పటికీ, పులిచెర్ల మండలంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిష్కరించిన తర్వాత విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విలీనంతో అన్నమయ్య జిల్లాలో మండలాల సంఖ్య 35కు చేరుతుంది. రాజకీయంగా కూడా మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.