వైసీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు అక్రమాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో సీఐడీ అధికారుల ముందు విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ నడుస్తోందని.. వాళ్లే వల్లనే తాను జగన్కు దూరమయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.