ఏపీ అసెంబ్లీ ఎన్నికలు -2024లో వైఎస్సార్సీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో.. జగన్ పార్టీని 11 నంబర్తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయమై టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీని ఓ రేంజ్లో ఆడుకుంటున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో వైసీపీకి పదకొండో బ్లాక్ కేటాయించారంటూ ఓ ఫొటో వైరల్ అయ్యింది. అయితే నిజంగానే 11వ బ్లాక్ కేటాయించారా? లేదంటే ఇది ఎడిట్ చేసిన ఫొటోనా? అనేది చూద్దాం..