పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు కనిపించింది. నిజానికి వర్మ టీడీపీ పట్ల ఎంతో లాయల్గా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే.. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తప్పితే.. మరో పార్టీలో చేరలేదు. ఇప్పుడు కూడా ఆయన పిఠాపురంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ ప్రచారం ఉత్తిదేనని చెప్పొచ్చు.