Devineni Uma Maheswara Rao: మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీని వీడుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. ఆయన వైఎస్సార్సీపీలో చేరతారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీనిపై దేవినేని ఉమా స్పందించారు.. టీడీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ట్వీట్ చేశారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. చంద్రబాబు, లోకేష్ పాలన చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ ప్రచారానికి కారణం ఏమిటి?