తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. పంటల దిగుబడి పెంచి రైతులకు లాభం చేకూర్చేలా విధానాలు అమలు చేస్తోంది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్ను అధిగమించి తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా పెరగింది. దాంతోపాటు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు.. వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి.