అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రజల్లో విమానాయానం అంటే ఒకరకమైన భయం నెలకొంది. ఈ ఘటన తర్వాత పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఇక తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. , హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ సకాలంలో సమస్యను గుర్తించడంతో విమానంలో ఉన్న 67 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.