హైదరాబాద్లో వరుస చోరీలతో హడలెత్తించిన అంతర్రాష్ట్ర ముఠా అనుకోని రీతిలో పోలీసులకు దొరికిపోయింది. ముఠాలోని ఓ సభ్యుడు ధరించిన చెప్పులే.. వీరిని పోలీసులకు పట్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఇటీవల 12 చోట్ల చోరీలు చేశారు. ఈ దొంగతనాలను సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. దర్యాప్తు మొదలెట్టారు. ఈ దర్యాప్తులోనే వింత చెప్పుల కారణంగా ముఠా మొత్తం పోలీసులకు దొరికిపోయింది.