ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న భక్తుల ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. అతివేగంతో వచ్చిన లారీ.. ఆ బస్సును ఢీకొట్టడంతో అందులో ఉన్న భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ బస్సులో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 33 మంది భక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో భక్తులకు గాయాలు కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.