శబరిమలలో భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఏపీవాసులకు గాయాలు..

2 months ago 10
శబరిమలలో ప్రమాదం చోటుచేసుకుంది. సన్నిధానం వద్ద ట్రాక్టర్ భక్తుల గుంపుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారందరూ ఏపీ వాసులేనని సమాచారం. అయితే ఎక్కడి వారనేదీ క్లారిటీ లేదు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అధికారులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article