వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ భూసేకరణపై రైతుల నిరసన సందర్భంగా పోలీసులు హింసకు పాల్పడ్డారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తులో తేలింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని, వారిని అరెస్టు చేసి వేధించారని, మహిళలను కూడా ఇబ్బందులకు గురిచేశారని NHRC నివేదికలో పేర్కొంది. ఈ ఘటనపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.