ఏపీలో టీడీపీ కూటమి సర్కారు మరో హామీని అమలు చేసింది. రాష్ట్రంలోని 28 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించింది. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులే స్వయంగా ఇళ్లకు వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి.. కుల ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు చెప్పారు. వివిధ కారణాలతో ఐదు లక్షల కుటుంబాలకు అందించలేదన్న అనగాని.. వారిలో ఎవరైనా అర్హులు ఉంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.