ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఎవరూ నిలబడకపోవటంతో మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మోషేన్ రాజు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇతర ఎమ్మెల్సీలు కలిసి తూమాటి మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సమయంలో అధికార పార్టీ సభ్యులు రాకపోవటంపై బొత్స విమర్శలు గుప్పించారు.