మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడికి ప్రసాదంగా గంజాయిని పెట్టిన యువకులపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ముక్తికి సోపానం అయిన శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్, వ్యూస్ కోసం ఇలా తెగించటంపై మండిపడుతూ.. చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.