శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లే బక్తులకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ గుడ్న్యూస్ చెప్పింది. పలు ఆలయాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. శివరాత్రి ఒక్కరోజు అంటే మార్చి 26న మాత్రమే ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు ఈ టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవాలని సూచించారు.