Madanapalle Man Dig Up A Dead Body: ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో, ఒక వ్యక్తి పూడ్చిపెట్టిన శవాన్ని తవ్వి తీయడానికి ప్రయత్నించాడు. తెలంగాణలోని మేదక్లో, ఇద్దరు వృద్ధుల అంత్యక్రియల అనంతరం చితాభస్మాన్ని దొంగిలించారు. బంగారం కోసమే ఈ దారుణాలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సాటి మనిషి పట్ల కనికరం లేకుండా జరుగుతున్న ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.