Ap 13 Bangladesh Fishermen Detained: శ్రీకాకుళం జిల్లా మూసవానిపేట తీరంలో బంగ్లాదేశీయులు ప్రత్యక్షమయ్యారు. ప్రతికూల వాతావరణం, బోటు మరమ్మత్తులతో దారి తప్పిన 13 మంది మత్స్యకారులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆహారం లేక ఇబ్బంది పడిన వీరిని స్థానికులు ఆదుకున్నారు.. వారికి భోజనం కూడా పెట్టారు. అయితే అనుమతులు లేకుండా భారత సముద్ర తీరానికి వచ్చిన వీరిపై కేసు నమోదు చేసి.. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించే అవకాశం ఉంది.