శ్రీకాళహస్తిలో రూ.500 రాహు కేతు సర్పదోష నివారణ పూజలు యథాతథంగా కొనసాగనున్నాయి. రూ.500 రాహు కేతు పూజలను రద్దు చేసి.. ప్రారంభ టికెట్ ధరను రూ.750కి పెంచాలని శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వెండి ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల నుంచి వ్యతిరేకత రావటంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు.. రూ.500 రాహు కేతు పూజలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ ఈవో వెల్లడించారు.