శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు సంబంధించి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. రూ.500 రాహు కేతు పూజను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠంగా రూ.5 వేలు ఉన్న రాహు కేతు పూజను మరో రూ.1000 పెంచుతున్నట్లు తెలిపారు. వెండి ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే సమయంలో స్థానికు భక్తులకు కేవలం రూ.100 కే రాహుకేతు పూజను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.