తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూలై 29న తిరుమలలో గరుడ పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై విహరించనున్నారు. తిరుమలలో ఒకే నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ నిర్వహించడం అరుదు. జూలై 10న గురు పౌర్ణమి సందర్బంగా తిరుమలలో గరుడ వాహన సేవ జరిగింది. ఇప్పుడు గరుడ పంచమి సందర్భంగా జూలై 29న మరోసారి గరుడ సేవ నిర్వహించనున్నారు.