తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక బిగ్ అలర్ట్ ఇచ్చింది. తిరుమలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి చెందిన పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 25 నుంచి 27 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉత్సవాల్లో ఏ రోజుల్లో ఏ కార్యక్రమం చేపట్టనున్నారనే వివరాలను కూడా టీటీడీ విడుదల చేసింది.