వీఐపీ భక్తులకు వసతి గదుల కేటాయింపులో టీటీడీ మార్పులు చేసింది. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో ఆధార్ కార్డుల ద్వారా వసతి గదులు కేటాయించేవారు. అయితే ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని దళారులు వసతి గదులను తమ అధీనంలో ఉంచుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇకపై తిరుమలలో వీఐపీ భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్ ఉంటేనే వసతి గదులు కేటాయిస్తారు. ఆధార్ కార్డు, శ్రీవారి దర్శనం టికెట్ ద్వారా వసతి గదులు కేటాయించేలా టీటీడీ మార్పులు చేసింది.