తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మార్చి 23 ( ఆదివారం) సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. వీరికి మార్చి 24న శ్రీవారి దర్శనం కల్పించనుంది. అలాగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా మార్చి 25, 30వ తేదీలలో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది.