తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి స్థానిక కోటా దర్శనం టోకెన్లను ఆదివారం జారీ చేయనున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతివాసులకు స్థానిక కోటా దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మే ఆరో తేదీ దర్శనాలకు సంబంధించిన టోకెన్లను ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి జారీ చేస్తారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో తిరుమల శ్రీవారి స్థానిక కోటా దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.