శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు..

3 months ago 28
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీలలో స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ తేదీలలో దర్శనాల కోసం మార్చి 1, 2వ తేదీలో టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి నాలుగో తేదీ నుంచి భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం కల్పిస్తామని.. ఇందుకోసం మార్చి మూడో తేదీన ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 3న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా రద్దుచేసినట్లు తెలిపింది.
Read Entire Article