తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీలలో స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ తేదీలలో దర్శనాల కోసం మార్చి 1, 2వ తేదీలో టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి నాలుగో తేదీ నుంచి భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం కల్పిస్తామని.. ఇందుకోసం మార్చి మూడో తేదీన ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 3న వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దుచేసినట్లు తెలిపింది.