తిరుమల భక్తుల వసతి సమస్య పరిష్కారానికి తిరుపతిలోని అలిపిరి వద్ద 'ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్' ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను కోరారు. కొండపై వసతి కొరత దృష్ట్యా ఈ బేస్ క్యాంప్ కీలకం కానుంది. వీటితో పాటు తిరుమలలో ఔషధ మొక్కల పెంపకం, విద్యుత్ అవసరాల కోసం విండ్ పవర్ వినియోగంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.