టీటీడీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు జరిగాయి. టీటీడీ ఈవో శ్యామలరావు జెండా ఎగురవేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం టీటీడీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమల అభివృద్ధికి విజన్ -2047 తయారుచేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ విజన్ రూపొందిస్తున్నట్లు వివరించారు.