తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు.. టీటీడీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి టీటీడీ సేవలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలను గౌరవించి.. సేవలను మరింత మెరుగుపరచటం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు టీటీడీ తెలిపింది.