TTD Makes FASTag mandatory in Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఆగస్ట్ 15 నుంచి తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అంటూ టీటీడీ ప్రకటించింది. ఫాస్టాగ్ లేకపోతే వాహనాలను అనుమతించబోమని తేల్చి చెప్పింది. భక్తులు, వాహనదారుల సౌలభ్యం కోసం అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఫాస్టాగ్ జారీ కేంద్రం కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ సూచించింది.