వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ ఈవో శ్యామలరావు అలిపిరి టోల్ ప్లాజా, భూదేవి కాంప్లెక్స్లను సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తుల కోసం రోజుకు 5,000 దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో కూడా టోకెన్ల జారీకి అనుమతులు కోరినట్లు ఆయన వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.