తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అనేక చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం.. మరో ఆలోచన చేస్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం అలిపిరి టోల్ ప్లాజాను ఆధునీకరించే ఆలోచన చేస్తోంది. అలిపిరి టోల్ ప్లాజాను అత్యాధునిక కేంద్రంగా మార్చి.. భక్తులు ఎక్కువ సేపు తనిఖీల కోసం అక్కడ వేచి చూడాల్సిన అవసరం లేకుండా చేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు శనివారం టీటీడీ ఉన్నతాధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు.