తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం టీటీడీ నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అన్నమయ్య భవన్ ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభించింది. మరోవైపు తిరుమలలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్ ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం వీటిని ప్రారంభించారు.