వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అద్భుతమైన మత సామరస్యం వెల్లివిరిసింది. రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులతో పాటు, ముస్లిం సోదరులు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. హిందూ ముస్లిం భాయీభాయీ అంటూ నినాదాలు చేశారు. భక్తులకు మజ్జిగ, మిఠాయిలు పంచిపెట్టి తమ సద్భావనను చాటుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు కన్నుల పండుగలా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో ఒకేసారి ఉత్సవాలు జరుగుతున్నాయి.