శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.7.19 కోట్ల నగదుతో పాటు 122 గ్రాముల బంగారం, 6.5 కేజీల వెండి లభించాయి. అమెరికా, యూకే, యూఏఈ వంటి వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో సమర్పించారు.