శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ భక్తులతో పాటుగా శివస్వాములు భారీ సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం ఆలయంలో సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. ఇరుముడి ఉన్న శివస్వాములకు స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. సాధారణ భక్తులను అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.