శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం.. ఉచిత స్పర్శ దర్శనం వారికి మాత్రమే..

6 months ago 18
శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ భక్తులతో పాటుగా శివస్వాములు భారీ సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం ఆలయంలో సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. ఇరుముడి ఉన్న శివస్వాములకు స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. సాధారణ భక్తులను అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
Read Entire Article