Srisailam Temple Fixed Deposits Record: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల నుంచి విరాళాలు, కానుకలు అందుతున్నాయి. ఈ క్రమంలో మల్లన్నకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పెరిగాయి. మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.97 కోట్లకు పైగా చేరాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా మిగులుపై ఫోకస్ పెట్టారు ఆలయ అధికారులు. అందుకే నగదు నిల్వలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇటు రెండు వారాలుగా భక్తుల రద్దీ పెరిగింది.