శ్రీశైలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. మొత్తం ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్రం నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కుటుంబం రోజూ 800 అద్దె చెల్లిస్తూ దాదాపు నెల రోజుల నుంచి వడ్డెర సత్రంలోనే బస చేస్తున్నట్లు తెలిసింది.