శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది,. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక భక్తుడు లడ్డూలో బొద్దింకను గుర్తించి, ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, సిబ్బంది ఆ లడ్డూను లాక్కున్నారని, వీడియో తీసిన వారిపై ఒత్తిడి చేసి విషయం బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పవిత్రమైన ప్రసాదంలో ఇటువంటి లోపం జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.