Srisailam Temple Prasadam Cockroach: శ్రీశైలం మల్లన్న ఆలయంలో లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే ప్రచారం అవాస్తవమని దేవస్థానం అధికారులు తేల్చి చెప్పారు. కావలికి చెందిన శరత్ చంద్ర అనే వ్యక్తి ప్రసాదంలో కీటకం ఉందంటూ ఆరోపించగా, సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఇది కుట్ర అని గుర్తించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రసాదాల నాణ్యతపై అనుమానాలు వద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.