Srisailam Temple Trust Board Key Decisions: శ్రీశైలం ఆలయ పాలకమండలి భక్తులకు శుభవార్తలు చెప్పింది. భక్తులకు ఉచితంగా లడ్డూలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక చెంచులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించనున్నారు. మరోవైపు కొలనుభారతి అమ్మవారి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం అనేక మార్పులు చేయనున్నారు. సాధారణ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పాలకమండలి చర్యలు చేపట్టింది. పాలకమండలి నిర్ణయాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.