Srisailam Brahmotsavam 2026 Devotees Allowed In Forest Route: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీశాఖ అధికారులు తీపికబురు చెప్పారు. రెండు రోజులు ముందుగానే అటవీ మార్గంలో భక్తులు కాలినడకన వెళ్లేందుకు అనుమతించారు. శుక్రవారం నుంచి భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళుతున్నారు. ఈ నెల 15 వరకు భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. అయితే భక్తులు కొన్ని నిబంధనలు పాటిస్తూ అటవీమార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు.