Srisailam Temple Free Sparsha Darshan July 1st: శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త! వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం ద్వారా రోజుకు 1,000 నుంచి 1,200 మందికి దర్శనం కల్పిస్తారు. ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో ఈ దర్శనం ఉండదు.