శ్రీశైలం సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. గూడెంలో నిద్రిస్తున్న చిన్నారిని.. చిరుత ఎత్తుకెళ్లింది. అది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు.. చిరుత వెంట అరుస్తూ పరుగులు తీయడంతో.. చిన్నారిని వదిలేసి చిరుత అడవిలోకి పారిపోయింది. తీవ్ర గాయాలైన ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు చెప్పడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.