శ్రీశైలం ఆలయంలో అధికారులు హుండీ లెక్కించారు. గత 27 రోజులకు గానూ భక్తులు భారీగా నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వామివారికి కానుకలుగా సమర్పించారు. ఈ క్రమంలోనే మొత్తం కానుకలు నగదు రూపంలో రూ.4.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. వీటితోపాటు బంగారు, వెండి ఆభరణాలు.. పలు దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయని వెల్లడించారు.