Free Sparsha Darshan at Srisailam Temple: శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దీంతో బుదవారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు.. ఆధార్ కార్డు నమోదు లేకుండానే మల్లన్న భక్తులు ఉచిత స్పర్శ దర్శనం అవకాశం కల్పించారు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ నిర్ణీత సమయంలో ఉచిత స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తున్నారు.